Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం సవతుల పోరు.. భర్త శవంతో జాగారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:36 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కళ్ళకుర్చి జిల్లాలో ఆస్తి కోసం ఇద్దరు సవతుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చనిపోయిన తన భర్తను ఖననం చేసేందుకు ఓ భార్య అంగీకరించలేదు. దీంతో భర్త శవంతో ఇద్దరు సవతులు ఏకంగా నాలుగు రోజుల పాటు జాగారం చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కళ్లకుర్చి జిల్లా సెమ్మనంగూరై గ్రామానికి చెందిన రామస్వామి (65)కి లక్ష్మి, వాసుకి అనే ఇద్దరు భార్యలున్నారు. తొలి భార్యకు ఐదుగురు కుమార్తెలు, రెండో భార్య వాసుకికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రామస్వామి ఈ నెల 22 రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు.
 
అదేసమయంలో రామస్వామి మొదటి భార్య లక్ష్మికి రాసిచ్చిన 10 సెంట్ల స్థలంలో తనకు సమాన వాటా (ఐదు సెంట్ల భూమి) ఇవ్వాలని రెండో భార్య వాసుకి పట్టుబట్టింది. తనకు వాటా ఇవ్వకుంటే భర్త మృత దేహాన్ని కదలనివ్వనని మొండికేసింది. అయితే తన స్థలంలో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని మొదటి భార్య లక్ష్మి తేల్చిచెప్పింది. దీంతో వాసుకి భర్త అంత్యక్రియలను అడ్డుకుంది. 
 
రోజులు గడిచిపోతున్నప్పటికీ సవతుల మధ్య తగాదా తెగకపోవడంతో అంత్యక్రియలకు వచ్చినవారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. రామస్వామి మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం సెమ్మనంగూరైకు వచ్చి వాసుకిని హెచ్చరించడంతో ఆమె మెత్తబడింది. దాంతో కుటుంబీకులు రామస్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments