Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో బీజేపీలోకి సౌరవ్‌ గంగూలీ!

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (09:07 IST)
నిన్నటి వరకు క్రికెట్ లో ప్రత్యర్థులను హడలెత్తించిన బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ.. ఇక రాజకీయాల్లో తన సత్తా చాటనున్నాడా?.. ఇందులో భాగంగా ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నాడా?... అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గంగూలియే సారధ్యం వహించేలా ఒప్పందం కూడా జరిగినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

అందుకోసమే తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్‌కు కేటాయించిన రెండెకరాల స్థలాన్ని వాపస్‌ ఇస్తున్నట్టు ఇటీవల సీఎం మమతా బెనర్జీని కలుసుకున్న గంగూలీ చెప్పాడట.

గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్‌ కోల్‌కతాలో ఓ పాఠశాల నెలకొల్పాలనుకుంది. అందుకు ఈశాన్య కోల్‌కతాలోని అతి ఖరీదైన న్యూటౌన్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు రెండెకరాలు కేటాయించింది. అయితే ఆ స్థలం న్యాయవివాదంలో చిక్కుకోవడంతో గంగూలీ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

స్థలం వివాదంలో ఉండడంతో సౌరవ్‌ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఎడ్యుకేషనల్‌, వెల్ఫేర్‌ సొసైటీ దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేస్తున్నట్టు లేఖ రాసింది. ఆ లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments