Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీలో చేరిక.. అంతలోనే రాజకీయాలకు బైబై..ఎవరు?

Advertiesment
BJP
, గురువారం, 23 జులై 2020 (09:57 IST)
బీజేపీలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు భారత్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మాజీ ఆటగాడు మెహతాబ్‌ హుస్సేన్‌.

తన వ్యక్తిగత కారణాల రీత్యానే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు. బీజేపీలో చేరాలన్న తన నిర్ణయం కారణంగా బాధపడ్డ తన బంధువులకు, స్నేహితులందరికీ క్షమాపణలు చెప్పాడు.

తన భార్య, పిల్లలు కూడా రాజకీయాల్లో చేరాలన్న తన నిర్ణయాన్ని అంగీకరించలేదని చెప్పారు. ఈరోజు నుండి తనకు ఏ పార్టీతోని సంబంధం లేదని ఈస్ట్‌ బెంగాల్‌ మాజీ కెప్టెనయిన మెహతాబ్‌ చెప్పారు.

మంగళవారం నాడు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభవార్త చెప్పిన సీరమ్ ఇనిస్టిట్యూట్ : అక్టోబరు నాటికి కోవిషీల్డ్ వ్యాక్సిన్