తండ్రి డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటినే పేల్చేశాడు..

Webdunia
గురువారం, 20 జులై 2023 (15:40 IST)
డబ్బుల కోసం సొంత ఇంటినే కూల్చేశాడు దుర్మార్గుడు. తండ్రి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో సొంత ఇంటిపైనే బాంబు దాడి చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై వేలచ్చేరి భారతీనగర్‌లో పనీర్‌సెల్వం (60) అనే వ్యక్తికి ఇటీవల భూమిని విక్రయించడంతో డబ్బు చేతికి అందింది. 
 
ఈ డబ్బు వచ్చిన సంగతి తెలుసుకున్న పనీర్ సెల్వం కుమారుడు అరుణ్.. తనకు మూడు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఇందుకు పనీర్ నిరాకరించాడు.  ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అరుణ్‌ తన బావ ప్రవీణ్‌తో కలిసి ఇంటిపై పేలుడు పదార్ధం విసిరాడు. 
 
ఈ ఘటనలో ప్రవీణ్‌ సోదరి రేఖ, మేనమామ వెట్రివేందన్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేయగా వారి ఇంట్లో మరో నాలుగు బాంబులు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులు, అరుణ్ తీవ్రంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments