Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు : కిషన్ - స్మృతిలకు చోటు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (13:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై ద‌ృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రధాని మోడీ నేతృ‌త్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్‌‌కు చోటు కల్పించారు. అలాగే, ప్రధాని నేతృత్వంలోని ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌‌మెంట్ కేబినెట్ కమిటీలో అశ్విన్ వైష్ణవ్, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, కిషన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.
 
ఇకపోతే, పెట్టుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీలో మోడీ, అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌‌లకు స్థానం దక్కింది. 
 
అలాగే, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌‌కు స్థానం కల్పించారు. ఇక కీలకమైన కేబినెట్ సెక్యూరిటీ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments