Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుల కోసం నర్సుగా మారిన షారూఖ్ హీరోయిన్

Sharukh khan
Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (16:35 IST)
కరోనా బాధితులను ఆదుకునేందుకు సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ హీరోయిన్ శిఖా మల్హోత్రా మాత్రం విభిన్నంగా స్పందించింది. నర్సింగ్ డిగ్రీ చేసిన ఆమె స్వయంగా నర్స్‌‌గా ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తోంది. 
 
షారూఖ్‌ ఖాన్‌ హీరోగా రూపొందిన `ఫ్యాన్` సినిమాలో పేరు తెచ్చుకున్న నటి శిఖా మల్హోత్రా. ఈ యువ నటీమణి ఓ హాస్పిటల్ లో కరోనా వైరస్‌ భారిన పడిన రోగులకు నర్స్‌గా సేవలందిస్తోంది. శిఖా ఢిల్లీలోని వర్ధమాన్‌ మహావీర్ మెడికల్‌ కాలేజ్‌, సఫ్ దార్‌ జంగ్ హాస్పిటల్లలో నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసింది.
 
ప్రస్తుతం నర్స్‌గా సేవలందిస్తున్న శిఖా మన దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా వుంటానని.. ఇందుకు మీ ఆశీస్సులు కావాలని చెప్పింది. దయచేసి అందరూ ఇంటి దగ్గరే ఉండండి. అధికారులకు సహకరించండి అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ముంబైలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments