Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో 144 సెక్షన్ ... 31వ తేది అర్థరాత్రి 12 గంటల వరకు..

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (19:04 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 31వ తేదీ వరకు  144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మార్చి 31వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. 144 సెక్షన్‌ విధించడంపై ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే 144 సెక్షన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
 
అలాగే, 13వ తేదీ వరకు మెట్రో రైళ్ళ సర్వీలను కేంద్రం నిలిపివేసింది. అదేవిధంగా అన్ని రకాల ప్రజా రవాణా కూడా ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేసే అవకాశం ఉంది. పైగా, ఒకే ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
 
దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు బయటకు రాకూడదనీ, సమూహాలుగా ఏర్పడకూదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమకు తాము స్వీయ నిర్బంధం పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విజయవంతంగా పూర్తిచేశారు. 
 
యూపీలో 15 జిల్లాలు లాక్‌డౌన్ 
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌(కోవిద్‌-19)ను అరికట్టేందుకు కేంద్రంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 జిల్లాలు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు వివరించారు. కరోనా మహమ్మారి నివారించాలంటే, ఈ నిర్ణయం తప్పదని యూపీ సీఎం వెల్లడించారు. 
 
ప్రజలు తప్పకుండా ప్రభుత్వ నిర్ణయాలను, సూచనలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలనీ, ఎవరు కూడా బయటకు రాకూడదని సీఎం తెలిపారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా వైరస్‌ను నివారించవచ్చని ఆయన అన్నారు. 
 
లాక్‌ డౌన్‌ అయిన జిల్లాలు: ఆగ్రా, లక్నో, గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌, ఘజియాబాద్‌, మొరదాబాద్‌, వారణాసి, లఖీంపూర్‌ ఖిరి, బరేలీ, ఆజమ్‌గఢ్‌, కాన్పూర్‌, మీరట్‌, ప్రయాగ్‌రాజ్‌, అలీఘర్‌, గోరఖ్‌పూర్‌, సహరాన్‌పూర్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావం ఆయా జిల్లాల్లో మార్చి 23 నుంచి 25 వరకు రెండు రోజులపాటు ఉంటుందని యూపీ సీఎం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments