జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది.. గూగుల్‌లో సెర్చ్ చేసి?

ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (16:19 IST)
ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో 2010లో ఆరేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెతికారు. కానీ బాలుడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. 
 
ఆ బాలుడు కూడా తల్లిదండ్రులకు దూరమై ఏడేళ్ల క్రితం బీహార్ నుంచి హర్యానా చేరుకున్నాడు. అక్కడి పోలీసులు అతనిని మాధవ్ బాల అనే ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలోని అధికారులు అడిగితే ఆ బాలుడు తన తల్లిదండ్రుల వివరాలను బయటికి చెప్పలేకపోయాడు. కానీ తన తండ్రితో పాటు సర్మన్ చౌక్‌కు వెళ్లి జిలేజీలు తిన్న విషయం మాత్రం ఆ బాలుడికి గుర్తుంది.
 
ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంధ సంస్థ అధికారులకు ఆశ్రమ అధికారులు తెలిపారు. దీంతో సర్మన్ చౌక్ వివరాలను స్వచ్ఛంధ సంస్థ గూగుల్‌లో సెర్చ్ చేసి.. బాలుడి వివరాలు తెలుసుకున్నారు. ఆపై స్థానిక పోలీసుల సాయంతో ఆ బాలుడిని సురక్షితంగా అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా జిలేజీ సెంటర్‌లో తల్లీ కుమారులు కలిసి తిన్న జిలేబీ ఆ ఇద్దరినీ మళ్లీ కలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments