Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది.. గూగుల్‌లో సెర్చ్ చేసి?

ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (16:19 IST)
ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో 2010లో ఆరేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెతికారు. కానీ బాలుడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. 
 
ఆ బాలుడు కూడా తల్లిదండ్రులకు దూరమై ఏడేళ్ల క్రితం బీహార్ నుంచి హర్యానా చేరుకున్నాడు. అక్కడి పోలీసులు అతనిని మాధవ్ బాల అనే ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలోని అధికారులు అడిగితే ఆ బాలుడు తన తల్లిదండ్రుల వివరాలను బయటికి చెప్పలేకపోయాడు. కానీ తన తండ్రితో పాటు సర్మన్ చౌక్‌కు వెళ్లి జిలేజీలు తిన్న విషయం మాత్రం ఆ బాలుడికి గుర్తుంది.
 
ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంధ సంస్థ అధికారులకు ఆశ్రమ అధికారులు తెలిపారు. దీంతో సర్మన్ చౌక్ వివరాలను స్వచ్ఛంధ సంస్థ గూగుల్‌లో సెర్చ్ చేసి.. బాలుడి వివరాలు తెలుసుకున్నారు. ఆపై స్థానిక పోలీసుల సాయంతో ఆ బాలుడిని సురక్షితంగా అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా జిలేజీ సెంటర్‌లో తల్లీ కుమారులు కలిసి తిన్న జిలేబీ ఆ ఇద్దరినీ మళ్లీ కలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments