Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు నిర్ణయంపై పునరాలోచన

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:03 IST)
కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకుంది జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం ఓ ప్రకటనలో వెల్లడించింది.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తొలుత పేర్కొన్నారు.

ప్రథమ పూజ, సంపన్న పూజలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసి.. ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు. 
 
దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శనార్థం ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం  42 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సి ఉంది.

కశ్మీర్‌లో తీవ్ర ఉగ్రవాద ముప్పు ఉన్న సమయంలోనూ ఈ యాత్ర జరగడం గమనార్హం. మరి ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments