Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయండి: సీపీఎం డిమాండ్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:16 IST)
దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా జైళ్లనూ కమ్మేసిందని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయడం కష్టమైనందున.. రాజకీయ ఖైదీలను వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

ఇటీవలి కాలంలో జైళ్లలోని కొందరు రాజకీయ, మానవ హక్కుల కార్యకర్తలు కరోనా బారిన పడినట్లు వార్తలస్తున్నాయని తెలిపింది. ఈ విధంగా జనసమూహం అధికంగా ఉండే జైళ్లలోని దుర్భరమైన పరిస్థితులు, కనీస సదుపాయాల లేమి వెరసి వారి ఆరోగ్య స్థితిని మరింత దిగజార్చుతోందని పేర్కొంది. 

అఖిల్‌ గొగోరుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలుస్తోందని, వరవరరావు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపింది.

జైళ్లలోని ఇరుకైన, అపరిశుభ్రమైన పరిస్థితుల మధ్య కల్పిత, తప్పుడు కేసులతో జైళ్లలో మగ్గుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు గౌతమ్‌ నవలఖా, అనిల్‌ తెల్తుంబ్డే, సుధా భరద్వాజ్‌, సోమసేన్‌, తదితరులకు కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇతర రాజకీయ ఖైదీల్లో ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో జైళ్లలోని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments