Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిని మానవహత్యలుగానే పరిగణించాలి : రతన్ టాటా

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (13:08 IST)
కేరళ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు టపాకాయలు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. దీన్ని జంతుహత్యగా కాకుండా మానవహత్యగా పరిగణించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఓ ఏనుగుకు టపాసులు ఉన్న పైనాపిల్ కాయ తినిపించి చంపేశారు. పైగా, ఈ ఏనుగు నిండు గర్భిణి. దీంతో ఏనుగుతో పాటు దాని కడుపులోని ఏనుగు పిల్ల కూడా చనిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
అలాగే, రతన్ టాటా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన కోరారు. 
 
'కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి' అంటూ రతన్ టాటా తన పోస్టులో కోరారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments