Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిని మానవహత్యలుగానే పరిగణించాలి : రతన్ టాటా

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (13:08 IST)
కేరళ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు టపాకాయలు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. దీన్ని జంతుహత్యగా కాకుండా మానవహత్యగా పరిగణించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఓ ఏనుగుకు టపాసులు ఉన్న పైనాపిల్ కాయ తినిపించి చంపేశారు. పైగా, ఈ ఏనుగు నిండు గర్భిణి. దీంతో ఏనుగుతో పాటు దాని కడుపులోని ఏనుగు పిల్ల కూడా చనిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
అలాగే, రతన్ టాటా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన కోరారు. 
 
'కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి' అంటూ రతన్ టాటా తన పోస్టులో కోరారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments