Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరును వణికిస్తున్న చెన్నై .. కొత్తగా 19 కేసులు

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (13:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదులో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 9,986 శాంపిళ్లను పరీక్షించగా మరో 98 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
మరోవైపు, 24 గంటల్లో 29 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,377 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,033 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,273 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 71కి చేరింది.
 
అయితే, గురువారం నమోదైన 98 కొత్త కేసుల్లో 19 కేసులు చెన్నై నుంచి వచ్చిన కేసులు కావడం గమనార్హం. చెన్నై నుంచి జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 19 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments