Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరువణ్ణామలైలో ఒకే రోజు 54 కేసులు.. అంతా చెన్నై నుంచి వెళ్ళిన వారే...

తిరువణ్ణామలైలో ఒకే రోజు 54 కేసులు.. అంతా చెన్నై నుంచి వెళ్ళిన వారే...
, మంగళవారం, 2 జూన్ 2020 (11:47 IST)
తమిళనాడులో కరోనా వైరస్ పెరిగిపోతోంది. రోజుకు వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఈ సంఖ్య చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనే మరీ ఎక్కువగా ఉన్నాయి. అలాగే తిరువణ్ణామలైలో ఆదివారం ఒక్క రోజే 54 కేసులు నమోదయ్యాయి. ఇవి చెన్నై నుంచి అక్కడికి వెళ్లిన వారితోనే వ్యాప్తి చెందాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 
ఇక, ఇప్పటి వరకు తమిళ రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని 43, ప్రైవేటుపరంగా ఉన్న 29 అంటూ, మొత్తంగా 72 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరిశోధనలు సాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో 1,149 కేసులు నమోదయ్యాయి. రెండో సారిగా 13 మరణాలు ఒకే రోజు సంభవించడం వైద్యుల్లో కలవరం రేపుతోంది.
 
లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన రంగాలను దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇటీవల వివరణాత్మక మార్గదర్శకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో భారీ సడలింపులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ భాయ్! మీరు చాలా గ్రేట్... మరో రెండు రైళ్లలో వలస కార్మికులను తరలించిన రియల్ హీరో