Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే షెల్టర్ హోంలో మాజీ మహిళా ఎస్ఐపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 మే 2020 (17:00 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రైల్వే షెల్టర్ హోంలో ఉంటున్న ఓ మాజీ మహిళా ఎస్ఐ ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు కామాంధులు లైంగికదాడికి తెగబడ్డారు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిరోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ 50 యేళ్ల మహిళకు కారుణ్య నియామకం కింద ఎస్ఐ ఉద్యోగం ఇచ్చాడు. ఈమె భర్త రైల్వే శాఖలో పని చేస్తూ మృతి చెందడంతో ఈమెకు ఉద్యోగం లభించింది. కొంతకాలం పని చేసిన తర్వాత ఆమె ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చింది. 
 
ఈ క్రమంలో లాక్‌డౌన్‌కు ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీ వైష్ణోదేవిమాత ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం ముగించుకుని తిరుగుపయనమైంది. సరిగ్గా ఆ సమయంలోనే దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ మహిళ మార్గమధ్యంలో చిక్కుకునిపోయారు.
 
ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆమెనుషెల్టర్ హోంలో ఉంచారు. గత నెలన్నర రోజులుగా అక్కడే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments