కోర్టు ప్రాంగణంలో క్లయింట్‌ను కాలితో తన్నిన లాయర్.. (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పామరులో కాదు.. ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు కూడా విచక్షణ మరిచిపోతున్నారు. ఫలితంగా, ఆగ్రహంతో రగిలిపోతూ, సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు.

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (05:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పామరులో కాదు.. ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు కూడా విచక్షణ మరిచిపోతున్నారు. ఫలితంగా, ఆగ్రహంతో రగిలిపోతూ, సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ లాయర్ తన క్లయింట్‌ను కోర్టు ముందే తన్ని హల్‌చల్ సృష్టించాడు. ఈ ఘటన రాంపూర్‌లో చోటుచేసుకుంది. చలానాకు సంబంధించిన సెటిల్‌మెంట్ కేసులో ఫీజు ఇవ్వడం లేదని లాయర్ కోర్టు ప్రాంగణంలోనే తన క్లయింటును కాలుతో తన్నాడు. సదరు క్లయింట్ పరుగెడుతుండగా మధ్యలో మరో లాయర్ కలగజేసుకుని అతన్ని కొట్టాడు. 
 
ఫీజు ఇవ్వడం లేదని లాయర్ అంటుండగా.. క్లయింట్ మాత్రం తాను చలానా సెటిల్‌మెంట్ కోసం లాయర్‌కు రూ.5000 ఫీజు ఇచ్చానంటున్నాడు. డబ్బులు తీసుకుని పనిచేయకపోవడంతో లాయర్‌ను ఫీజు తిరిగివ్వాలని అడిగితే తనపై దాడికి పాల్పడ్డారని క్లయింట్ ఆవేదన వ్యక్తం చేశాడు. లాయర్ క్లయింట్‌ను కాలుతో తన్నిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments