Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో నల్గొండ వైద్యుడితో మాట్లాడుతూ.. రోగే కత్తితో పొడిచేశాడు..

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి వైద్యుడని.. అతనిని చంపింది రోగి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాన్సాస్‌లోని ఎడ్జ్‌మూర్‌లోని క్లినిక్ వద్ద డాక్టర్ అచ్య

అమెరికాలో నల్గొండ వైద్యుడితో మాట్లాడుతూ.. రోగే కత్తితో పొడిచేశాడు..
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:55 IST)
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి వైద్యుడని.. అతనిని చంపింది రోగి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాన్సాస్‌లోని ఎడ్జ్‌మూర్‌లోని క్లినిక్ వద్ద డాక్టర్ అచ్యుతారెడ్డిపై ఓ దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో అచ్యుతారెడ్డి అక్కడికక్కడే తీవ్రగాయాలతో మరణించాడు. 
 
అచ్యుతారెడ్డి మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించి, ఉమర్‌ రషీద్‌ దత్ అనే అనుమానితుడిని విచితలోని కంట్రీక్లబ్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కత్తితో పొడిచిన దుండగుడు కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు. 
 
హత్యకు గురైన అచ్యుతా రెడ్డి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన వారని, ఆయన ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేసి, 1989 నుంచి అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్నారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 
 
అచ్యుతారెడ్డి కుటుంబానికి సాయం చేసేందుకు సిద్ధంగా వున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇదే కాన్సాస్ నగరంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూఛిబొట్ల అమెరికాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో డేరా బాబా‌కు లగ్జరీ గెస్ట‌హౌస్‌లు.. హనీప్రీత్‌తో కలిసి ఎంజాయ్