Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ ఫుడ్‍ను బ్యాన్ చేయండి.. అథవాలే డిమాండ్

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:09 IST)
కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చైనా ఫుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనీస్ ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలనీ రాందాస్ అథవాలే డిమాండ్ చేసారు. అలాగే ప్రజలు చైనీస్ ఫుడ్‌ని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. గతంలో ఈయనే కరోనా వైరస్ విషయంలో "గో కరోనా గో " అంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీస్ ఆహారంపై నిషేధం విధించాలని ఆయన పట్టుబట్టారు. 
 
భారత్‌- చైనా సరిహద్దులో గాల్వాన్‌ లోయ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతుతూ.. '' చైనా 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. భారత్‌ను అవమానించే చర్యలకు దిగింది. చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని నా సూచన. చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు కూడా వాటిని మూసివేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలివ్వాలి. చైనా ఆహార ఉత్పత్తులను తినేవారు కూడా వాటిని బహిష్కరించాలని నా వినతి'' అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments