Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారిటోరియంపై సుప్రీం.. వడ్డీ మీద వడ్డీ తీసుకుంటారా? వడ్డీని రద్దు చేయలేరా?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (13:37 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగులు తీసుకున్న రుణాలుపై మారటోరియంతో వడ్డీపై వడ్డీ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పేర్కొంది. మారటోరియం నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పునఃసమీక్షించాలని సూచించింది. 
 
ఆరు నెలల మారటోరియం వ్యవధిలో వడ్డీపై వడ్డీ విధించడాన్ని ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని గత శుక్రవారం విచారణ జరిగింది. ఆ తర్వాత కేంద్రం, ఆర్బీఐ చర్చించి ఓ నిర్ణయానికి రావాలని చెప్పి, బుధవారం విచారణ జరిపింది.
 
కేంద్రం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వడ్డీని పూర్తిగా రద్దు చేయడం బ్యాంకులకు సాధ్యం కాదన్నారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే బ్యాంకింగ్ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. అయితే బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై ప్రకటించిన మారటోరియం విధానంతో ప్రయోజనం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 
ఇది వడ్డీమీద వడ్డీ విధింపులా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విధానంలో ఔచిత్యం ఏదీ కనబడటం లేదని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. 
 
ఈ స్కీంని పునఃసమీక్షించాలని కేంద్రం, ఆర్బీఐలకు సూచించింది. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్రత్యేకంగా సూచించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారాన్ని బ్యాంకులకు పూర్తిగా వదిలేయరాదని అభిప్రాయపడింది. ఇది కస్టమర్‌కు, బ్యాంకులకు మధ్య వ్యవహారమని కేంద్రం చెప్పడం కుదరదని పేర్కొంది. 
 
ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని ఒకటి మారటోరియం కాలంలో అసలు వడ్డీ విధించకపోవడం ఒకటి, వడ్డీ మీద వడ్డీ విధింపు విధించకపోవడం రెండోది అని అభిప్రాయపడింది. మొత్తం వడ్డీ రద్దు కాకపోయినా, వడ్డీమీద వడ్డీని అయినా తొలగించాలని చెప్పింది.
 
ఇక వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులపై ఎంత భారం పడుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కావాలని బ్యాంకులు కోరాయి. బ్యాంకులు సమయం అడగడంతో కేసును ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఆ లోపు మారటోరియంపై కొత్త నిబంధనలు తీసుకు వచ్చే అవకాశం ఉందా అనేది అధ్యయనం చేయాలని బ్యాంకులకు సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments