Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వ్యాపారుల వద్ద ఏవీ కొనుగోలు చేయొద్దు : బీజేపీ ఎమ్మెల్యే పిలుపు

Advertiesment
Covid 19
, మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం మర్కజ్ మత సమ్మేళనమే కారణమని, అందువల్ల ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు, ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేష్ తివారీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశమంతా పోరాడుతుందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలెవ‌రూ ముస్లింల వద్ద కురగాయలుగానీ, ఎలాంటి ఇత‌ర వస్తువులుగానీ కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించ‌డానికి కారణం కూడా ముస్లింలేనని ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలవ‌ల్లే క‌రోనా విస్త‌రించింద‌ని వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీలోని విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన్ కరోనా పాజిటివ్ కేసులు