Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు సరిగ్గా తరగడం రాదా.. అంతే అత్తపై కోడలు..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:50 IST)
చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకు గురయ్యే వారు నేరాలకు పాల్పడుతున్నారు. హంతకులుగా మారుతున్నారు. తాజాగా కూరగాయలు సరిగ్గా కోయమంటూ దుర్భాషలాడిన అత్తపై కోడలు కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన 62 ఏళ్ల మోహినీ దేవికి, తన కోడలు మమతా దేవితో ఒక్క క్షణం పడేది కాదు. 
 
గత సోమవారం మమత కూరలు తరుగుతూ ఉంటే మోహిని అక్కడకు వచ్చి.. `కూరగాయలు సరిగా కోయడం రాదా..` అంటూ దుర్భాషలాడింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన మమత కూరగాయలు కోసే కత్తితో అత్తపై దాడి చేసింది.
 
అత్త శరీరంపై 26 చోట్ల కత్తితో గాయాలు చేసింది. అనంతరం తన లగేజీ తీసుకుని ఇంటి నుంచి పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మమతను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments