పెళ్లి బారాత్‌లో విషాదం.. ట్రక్కు దూసుకెళ్లి 13 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:35 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 13 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదం వివరాలు ఇలావున్నాయి. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘర్ - జైపూర్ జాతీయ రహదారిపై ఓ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఈ ఊరేపింగింపులో నిమగ్నమైవున్న వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
 
అలాగే, వధువు కూడా తీవ్రంగా గాయపడింది. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments