Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఒక్కసారి పోటీ చేయండి.. అమిత్ షా : కుదరదు.. ధన్యవాదాలు.. అద్వానీ

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:09 IST)
భారతీయ జనతా పార్టీలో భీష్మపితామహులు పేరుగడించిన రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో బీజేపీలో అద్వానీ శకం ఇక ముగిసినట్టే. నిజానికి గత 2014 ఎన్నికల్లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బలవంతం మీద ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గాంధీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 
 
అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే స్థానం పోటీ చేయాలని అద్వానీని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. అద్వానీని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా ఒప్పించేందుకు ఆయన నివాసానికి అమిత్ షా వెళ్లారు. అపుడు గాంధీ నగర్ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. 
 
దాంతో, కనీసం ఎల్.కె.అద్వానీ సంతానమైన ప్రతిభ, జయంత్‌లలో ఒకరిని గాంధీనగర్‌ బరిలో దింపాలని, వారిని గెలిపించుకొనే బాధ్యతను తీసుకుంటామని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా అద్వానీ నిరాకరించారు. 'కుదరదు. ధన్యవాదాలు' అని ముక్తసరిగా చెప్పి అమిత్‌షాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments