Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌కు మటన్ కూర వంట నేర్పించిన లాలూ ప్రసాద్ యాదవ్

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (10:13 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మటన్ కూర ఎలా ఉండాలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైగా తనకు కూడా వంట చేయడం వచ్చని, కానీ, పాకశాస్త్ర నిపుణుడిని మాత్రం కాదని లాలూతో రాహుల్ అన్నారు. అలాగే, లాలూగారు మాత్రం అద్భుతంగా వంట చేస్తారు అని ఆయన కితాబిచ్చారు. అద్భుతంగా వంట వచ్చిన భారత రాజకీయనేతల్లో లాలూ ముందుంటారని పేర్కొన్నారు.
 
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో రాహుల్ గాంధీకి మటన్ ఎలా వండాలో చెబుతూ లాలూ పలు సూచనలు చేశారు. మటన్‌ను కలపడం, మసాలా జోడించడం.. ఇలా అన్ని విషయాలూ వివరించారు. మటన్ రెడీ అవుతున్న సమయంలో రాహుల్, లాలూ మధ్య ఆసక్తికర సంవాదం కొనసాగింది. రాజకీయాలకు సంబంధించి సీక్రెట్ మసాలా ఏంటని రాహుల్ ప్రశ్నించగా కష్టించి పనిచేయడమేనని లాలూ జవాబిచ్చారు. 
 
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రాజకీయాల్లో కూడా అన్నీ కలిపేయడం లాలూకు అలవాటు అంటూ జోక్ చేసిన రాహుల్ గాంధీ.. వంటకు, రాజకీయాలకు మధ్య తేడా ఏమిటని లాలూను ప్రశ్నించారు. 'అవును.. నేను అదే చేస్తా. అయితే, కాస్తంత కలపకుండా రాజకీయాలు సాధ్యం కావు' అంటూ లాలూ చమత్కరించారు.
 
మునుపటి నేతలు దేశాన్ని ఓ కొత్త, న్యాయబద్ధమైన మార్గంలో నడిపించారని, ఆ విషయాన్ని యువ నేతలు మర్చిపోకూడదని లాలూ అభిప్రాయపడ్డారు. రాహు‌ల్‌తో పాటూ అక్కడ బీహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, సోదరి మీసా భారతి కూడా ఉన్నారు. బీజేపీపై కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి 'రాజకీయ ఆకలి' ఎక్కువని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments