Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాఖీ గిఫ్ట్.. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200ల సబ్సీడీ

gas cylinder boy
, మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:25 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన చర్యగా, కేంద్ర క్యాబినెట్ అన్ని గృహ ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని ప్రకటించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నిర్ణయం మహిళలకు రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు.
 
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం దక్కనుంది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు అదనంగా రూ.200 వరకు తగ్గించనుంది. 
 
దాంతో పీఎంయూవై లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.400 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.6100 కోట్లు, 2023-24లో రూ.7680 కోట్ల భారం పడుతుందని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖగోళంలో అద్భుతం.. ఆగస్టు 30న బ్లూ మూన్