Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుమానం.. సహజీవన భాగస్వామిని కుక్కర్‌తో కొట్టి చంపాడు.. ఎక్కడ?

murder
, సోమవారం, 28 ఆగస్టు 2023 (13:08 IST)
బెంగుళూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ భాగస్వామిని కొట్టి చంపినందుకు 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భాగస్వామి తనను మోసం చేసిందనే అనుమానంతో ఇద్దరు గొడవకు దిగారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వైష్ణవ్, దేవా(24)లు బెంగళూరులో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారు కళాశాల నుండి ఒకరికొకరికి పరిచయం. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని కోరమంగళలోని సేల్స్, మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. శనివారం జరిగిన గొడవలో వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి హత్య చేశాడు. దేవా సోదరి ఫోన్‌లో రాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
 
"వైష్ణవ్‌కు తన భాగస్వామిపై కొన్ని సందేహాలు ఉన్నాయి, దానిపై వారు గొడవపడ్డారు. శనివారం ఇది మళ్లీ జరిగింది, అతను మహిళను కుక్కర్‌తో కొట్టాడు" అని దక్షిణ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి సీకే బాబా తెలిపారు. 
 
సంఘటన తర్వాత వైష్ణవ్ పరారీలో వున్నాడు. అయితే పోలీసులు అతనిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం వారి తల్లిదండ్రులకు తెలిసిందని పోలీసులు గుర్తించారు. 
 
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. వైష్ణవ్‌పై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో అజిత్‌ కంపెనీకి కీలక ప్రాజెక్టును అప్పగించిన భారత రక్షణ శాఖ