Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే గర్భస్రావం వికటించింది.. పూణే మహిళ మృతి.. ఆడబిడ్డని తెలిసి..?

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:42 IST)
పూణె జిల్లాలోని తన ఇంట్లో ఆడ పిండాన్ని గర్భస్రావం చేసే ప్రక్రియలో 24 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్త, అతని తండ్రిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఇందాపూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో నాలుగు నెలల పిండాన్ని పొలంలో పూడ్చిపెట్టారు.
 
"మృతి చెందిన మహిళ 2017లో నిందితుడితో వివాహం చేసుకుంది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2021లో ఆ మహిళకు మగబిడ్డ పుట్టాడు" అని పోలీసులు తెలిపారు. 
 
ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. పిండం ఆడది అని ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే వైద్యుడిని పిలిపించి, మహిళకు అబార్షన్ చేయించారు. 
 
ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. అయితే గర్భస్రావం చికిత్స వికటించి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments