Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే గర్భస్రావం వికటించింది.. పూణే మహిళ మృతి.. ఆడబిడ్డని తెలిసి..?

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:42 IST)
పూణె జిల్లాలోని తన ఇంట్లో ఆడ పిండాన్ని గర్భస్రావం చేసే ప్రక్రియలో 24 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్త, అతని తండ్రిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఇందాపూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో నాలుగు నెలల పిండాన్ని పొలంలో పూడ్చిపెట్టారు.
 
"మృతి చెందిన మహిళ 2017లో నిందితుడితో వివాహం చేసుకుంది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2021లో ఆ మహిళకు మగబిడ్డ పుట్టాడు" అని పోలీసులు తెలిపారు. 
 
ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. పిండం ఆడది అని ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే వైద్యుడిని పిలిపించి, మహిళకు అబార్షన్ చేయించారు. 
 
ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. అయితే గర్భస్రావం చికిత్స వికటించి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర ప్రభంజనం.. అడ్వాన్స్ బుక్సింగ్స్‌తో షేక్ షేక్.. అమెరికాలో కొత్త రికార్డ్

ప్రేమ.. పెళ్లి.. పేరుతో రూ.2కోట్లు గుంజేశాడు.. యూట్యూబర్ హర్షపై కేసు

జానీ మాస్టర్ కి జరిగింది రేపు వారికీ జరుగుద్ది : సుహాసిని కామెంట్

హీరో కిరణ్ అబ్బవరం క సినిమా షూటింగ్ పూర్తి

గోపీచంద్, కావ్యా థాపర్ ల విశ్వం నుంచి సెకెండ్ సింగిల్ మొండి తల్లి పిల్ల నువ్వు రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

తర్వాతి కథనం
Show comments