మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

ఐవీఆర్
మంగళవారం, 29 జులై 2025 (14:08 IST)
పూణెలో విషాదకర సంఘటన జరిగింది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హింజెవాడిలోని అట్లాస్ కాప్కోలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మృతుడిని నాసిక్‌కు చెందిన పియూష్ అశోక్ కవాడేగా పోలీసులు గుర్తించారు. కవాడే కంపెనీ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్ నోట్‌ను ఉంచాడని పోలీసులు తెలిపారు.
 
పింప్రి చించ్వాడ్ పోలీసుల కథనం ప్రకారం, కవాడే గత ఏడాది కాలంగా హింజెవాడిలోని ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లాడు. కానీ ఉదయం 10.10 గంటల ప్రాంతంలో తనకు ఛాతీ నొప్పి ఉందని చెప్పి మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేసాడు. కానీ ఆ తర్వాత అతడు కంపెనీ 7 అంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, హింజెవాడి పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి చేరుకుంది. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పంధారే మాట్లాడుతూ, మృతుడు తన సూసైడ్ నోట్‌లో తాను జీవితంలో విఫలమయ్యానని పేర్కొన్నాడంటూ వెల్లడించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం అతడు పని ఒత్తిడి, మానసిక ఆందోళనతో వున్నట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments