Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల దాష్టీకం.. గర్భిణీపై ట్రాక్టర్ ఎక్కించి చంపేశారు..

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (16:36 IST)
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టంట్ లోన్ల పేరిట చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వున్నాయి. అయితే జార్ఖండ్‌లో లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు దారుణానికి ఒడిగట్టారు. గర్భిణి అయిన రైతు కూతురుపై ట్రాక్ట‌ర్ ఎక్కించి ఆమె మృతికి కార‌ణం అయ్యారు.
 
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తండ్రి ఓ ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని ట్రాక్ట‌ర్ కొనుగోలు చేశారు. వాయిదాలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఏజెంట్లు ట్రాక్ట‌ర్‌ను స్వాధీనం చేసుకోవాల‌ని అనుకున్నారు. 
 
కానీ, రైతుకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వ‌కుండానే ఇంటికి వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఇంటిద‌గ్గ‌ర ఉన్న రైతు కుమార్తెకు, ఏజెంట్ల‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
 
ఆమెపై దాడి చేసి, ప‌క్క‌కు తోసేసి రిక‌వ‌రీ ఏజెంట్లు ట్రాక్ట‌ర్ తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. స‌ద‌రు మ‌హిళ అడ్డు రావ‌డంతో ఆమెపైకి ట్రాక్ట‌ర్ ఎక్కించారు. 
 
తీవ్ర గాయాల పాలైన గ‌ర్భిణిని బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్ప‌టికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments