Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్బీఐ బాండ్ల వేలం.. ఏపీకి మరో రూ.వెయ్యి కోట్లు అప్పు

andhrapradesh logo
, మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకులో బాండ్లను వేలం వేయడం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. ఇది 18, 20 యేళ్ల కాల వ్యవధుల్లో తీర్చేలా రూ.500 కోట్లు చొప్పున రెండు విడతలుగా తీసుకుంది. 
 
ఆర్బీఐ తాజాగా సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్లను రూ.18 యేళ్ల కాల వ్యవధికి రూ.7.5 శాతం వడ్డీకి తీసుకుంది. అలాగే, మరో రూ.500 కోట్లను రూ.20 యేళ్ల కాల వ్యవధికి రూ.7.45 శాతం వడ్డీకి సేకరించింది. 
 
ఈ కొత్త రుణంతో ఏపీ ఈ యేడాదిలో ఇప్పటివరకు రూ.48,6087 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ యేడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48 కోట్లు కాగా, తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌ : భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్విక్‌ పెట్టిన డ్రగ్ అడిక్ట్ భర్త