Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోక్సో కోర్టు అదుర్స్.. యావజ్జీవ కారాగార శిక్ష...

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (09:36 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న వేళ.. దేశంలోనే తొలిసారిగా బీహార్‌లోని పోక్సో కోర్టు ఒక్క రోజులోనే అత్యాచార కేసును విచారించి సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాకు చెందిన వ్యక్తి జులై 22న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
ఈ ఘటనపై ఆ తర్వాతి రోజు కేసు నమోదైంది. అక్టోబర్ నాలుగో తేదీన కేసు విచారణకు రాగా.. అదే రోజు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేకాదు, బాధితురాలికి రూ. 7 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ తాజాగా వెలుగు చూసింది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments