Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు క్రమంగా మూడు రాష్ట్రాలకు దారితీయొచ్చు!

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు భవిష్యత్తులో క్రమంగా మూడు రాష్ట్రాలకు దారతీయొచ్చునని భువనేశ్వర పీఠాధిపతి (గన్నవరం) కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. అందువల్ల మూడు రాజధానుల అంశాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఆయన అన్నారు.
 
కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పైగా, త్వరలోనే మూడు రాజధానుల కోసం సమగ్రమైన మెరుగైన బిల్లును ప్రవేశపెడతామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 
 
దీనిపై గుంటూరులోని తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలానంద భారతి మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడుతామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కాలక్రమంలో మూడు రాష్ట్రాలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉన్నపుడు మూడు ప్రాంతాలను మూడు ముక్కలు చేయాలన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. 
 
ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే ప్రాథమిక సూత్రం మేరకు ఒకే ప్రాంతంలోనే రాజధానివుంచి.. అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలని కోరారు. పైగా, ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేసి, రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించారని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments