Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:43 IST)
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కూడా ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
థానే జిల్లాలని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీ నుంచి సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ నుంచి ముంబైకు చేరుకున్నాడు. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వీటిని పరిశీలించగా, అతనికి ఒమిక్రాన్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, ఆదివారం సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో తేలింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments