Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలూరులో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:18 IST)
జిల్లా కేంద్రమైన వేలూరు పట్టణంలో సోమవారం వేకువజామున భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వరదలు కూడా ముంచెత్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజా వేలూరులో భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం తెలిపింది. 
 
భూకంప కేంద్రాన్ని వేలూరుకు 59 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అలాగే, భూగర్భంలో 25 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్టు సిస్మోలజీ విభాగం తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై తదితర వివరాలు తెలియాల్సివుంది.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments