Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలేజీలో 182 మందికి కరోనా: ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచింది..

కాలేజీలో 182 మందికి కరోనా: ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచింది..
, శుక్రవారం, 26 నవంబరు 2021 (16:10 IST)
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా పాఠశాలల్లో, కళాశాలల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ధార్వాడలోని ఓ మెడికల్ కాలేజీలో 182 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 
 
ఓ విద్యార్థి చేసిన ఫ్రెషర్స్ పార్టీ కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ముందుగా 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 182కు చేరింది. 
 
క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో ఈ పార్టీ కాస్త వైరస్ వ్యాప్తికి దారితీసిందని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారందర్నీ క్వారంటైన్ కు తరలించామన్నారు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. హాస్టల్స్ కూడా మూసివేశామన్నారు. 
 
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని సైతం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కొందరిలో తేలిక పాటి కరోనా లక్షణాలు ఉంటే.. మరికొందరిలో మాత్రం అసలు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. 
 
అందర్నీ క్యాంపస్ లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అటు ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం: సీఎం జగన్‌