Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదర్భ క్రికెటర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్

విదర్భ క్రికెటర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్
, ఆదివారం, 21 నవంబరు 2021 (11:48 IST)
సాధారణంగా అది దేశవాళీ లేదా అంతర్జాతీయ క్రికెట్లలో హ్యాట్రిక్ సాధించడమే చాలా అరుదుగా సాగుతుంది. కానీ, విదర్భ క్రికెటర్ దర్శన్ నల్కండే మాత్రం ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనట చోటుచేసుకుంది. నాలుగు బంతుల్లో నలుగురిని పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అభిమన్యు మిథున్ ఉన్నాడు. 
 
ఈ టోర్నీలో భాగంగా, శనివారం ఢిల్లీలో కర్నాటక జట్టుతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో దర్శన్ బంతితో చెలరేగిపోయాడు. తాను వేసిన ఓవర్‌లో రెండో బంతికి జోషి (1)ని ఔట్ చేసి, మూడో బంతికి శరత్‌ను నాలుగో బంతికి జె.సుచిత్‌ను డకౌట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. 
 
ఆ తర్వాత చివరి బంతికి ఫామ్‌‍లో ఉన్న మనోహర్‌ను 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ శాడు. తద్వారా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఫలితంగా ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డును అభిమన్యు మిథున్ సాధించాడు. 
 
అయితే, మిథున్ ఏకంగా ఐదు బంతుల్లో ఐదుగురు ఆటగాళ్లను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. కర్నాటకకు మిథున్ ప్రాతినిథ్యం వహించిన  2019లో ఈ రికార్డు సాధించాడు. కానీ, దర్శన్ మాత్రం నాలుగు బంతుల్లో నలుగురిని పెవిలియన్‌కు చేర్చి రికార్డు సాధించాడు. దీంతో శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్‌ను పెద్దన్నయ్య అనేందుకు సిగ్గుండాలి: సిద్ధూపై గంభీర్ ఫైర్