Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వన్ ఎర్త్ - వన్ ఫ్యామిలీ - వన్ ఫ్యూచర్' : జీ20 లోగో ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:17 IST)
"వన్ ఎర్త్ - వన్ ఫ్యామిలీ - వన్ ఫ్యూచర్‌" పేరుతో జీ20 లోగోను కేంద్రం ఆవష్కరించింది. వచ్చే నెలలో భారత్ జీ20 దేశాల ప్రెసిడెన్సీ (అధ్యక్షత)ని చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని కేంద్రం ఓ లోగోను, థీమ్, వెబ్‌సైట్‌ను రూపొందించగా, దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆవిష్కరించారు. 
 
పైగా, డిసెంబరు ఒకటో తేదీ నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండటం చారిత్రాత్మక ఘట్టమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుంది. ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ స్వీకరించనుంది. 
 
జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్‌లో 200 కీలక సమావేశాలు జరుగుతాయి. 32 విభిన్న రంగాలపై భారత్‌లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే యేడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ నేపథ్యంలో జీ20 లోగోను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, "వసుదైక కుటుంబం" అనేది భారత్ నివాదం అని ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోడీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఆయన పేర్కొన్నారు. పైగా ఈ లోగోపై సూచనలు సలహాలు తెలియజేయాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments