Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్.. నేడు ప్రమాణం

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (07:56 IST)
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమలో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 
 
కాగా, ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్టిస్ యుయు లలిత్ సోమవారంతో పదవీ విరమణ చేసిన విషయం తెల్సిందే. ఆయన తన వారుసుడిగా చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. దీంతో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పేరును కేంద్రం అధికారికంగా ప్రటించిన విషయం తెల్సిందే. 
 
సుదీర్ఘకాలంగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్న జస్టిస్ చంద్రచూడ్ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయాధీశుడుగా రెండున్నరేళ్ల పాటు సేవలు అందిస్తారు. 1988లో అదనపు  సొలిసిటర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
 
ఈయన గతంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. దేశంలో కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) వంటి కేసుల్లో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులను వెలువరించారు. ీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments