Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (07:33 IST)
నేపాల్‌ను భారీ భూకంపం వణికించింది. ఇది భూకంప లేఖినిపై 6.3గా నమోదైంది. ఈ భూప్రకంపనలు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపించాయి. అర్థరాత్రి 1.57 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం (సిస్మోలజీ సెంటర్) తెలిపింది. కేవలం రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం కారణంగా ఓ ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో నేపాల్‌లో తరచుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. అక్టోబరు 19 ఖాట్మంటులో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే, జూలై 31వ తేదీన 6.0 తీవ్రతో భూకంపం వచ్చింది. గత 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 22 వేల మంది గాయపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments