Abhiram Varma, Satvika Raj
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ "నీతో". పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందన  లభించింది.  "మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్  అయిందో  గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్  అవుతుందో గుర్తురాదు"లాంటి యూత్  కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి ఈ చిత్రంలో. "నీతో" చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 
	 
	తాజాగా ఈ చిత్రం నుండి "లలనా మధుర కలనా" అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వరుణ్ వంశి బి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. 
	"అలుపై, మలుపై, ఎదురై ఆదమరించింది గమననా 
	గెలుపై మెరుపై మెరిసేనా గగనములై  .. అంటూ పాటలోని మంచి పొయిటిక్ ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తుంది. 
	 
	"నీతో" చిత్రానికి సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన 'నీతో' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.