Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ 4.O : సంకేతాలు పంపిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 12 మే 2020 (12:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రం లాక్డౌన్‌ను అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్‌ను పొడగించాలా? వద్దా? అనే అంశంపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించారు. 
 
మరోవైపు, దేశంలో ప్రతి రోజూ దాదాపుగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థుల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడగా, వారితో ప్రధాని కూడా ఏకీభవించినట్టు సమాచారం. పైగా, ఆయన లాక్డౌన్ 4.Oకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. 
 
అంతేకుండా, దేశంలో రైళ్ళ రాకపోకల పునరుద్ధరణను కూడా పలువురు సీఎంలు వ్యతిరేకించారు. ముఖ్యంగా, తెలంగాణ, బీహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే రైళ్ల పునరుద్ధరణకు ససేమిరా అన్నారు. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని బేరీజు వేసిన తర్వాత ప్రధాని మోడీ సైతం మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడగింపునకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments