Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. మీ అభిప్రాయం చెప్పండి : 'మాజీ దిగ్గజాలకు' మోడీ ఫోన్

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (17:12 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశాన్ని, దేశ ప్రజలను రక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు పోరాడుతున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. నిత్యం వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే, తన మంత్రివర్గ సహచరులకు, ఆరోగ్య శాఖ అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
అలాగే, తనవంతు కృషిగా ఇలాంటి కష్టకాలంలో దేశ ప్రజలందరినీ ఐక్యంగా ఉంచుతూ, ఏకతాటిపైకి తెచ్చేందుకు పాటుపడుతున్నారు. ఇందులోభాగంగానే మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వగా అది విజయవంతమైంది. ఇపుడు ఏప్రిల్ 5వతేదీ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు గృహాల్లోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి, క్యాండిల్స్, నూనె దీపాలను వెలిగించాలంటూ పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు అనేక మంది మద్దతునిచ్చారు.
 
ఇదిలావుంటే, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం స్వయంగా ఫోన్లు చేశారు. కరోనా వ్యాప్తి నివారణ, సహాయక చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. పలువురు రాజకీయనేతలతో మోడీ స్వయంగా ఫోనులో మాట్లాడారు. 
 
ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఇలా అనేక రాజకీయ పార్టీల నేతలకు ఆయన ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments