Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా కొత్త అధినేతలకు మోడీ - చంద్రబాబు శుభాకాంక్షలు

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (12:40 IST)
అమెరికా దేశ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు శుభాకాక్షలు తెలిపారు. బైడెన్ విజయంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆకాంక్షిస్తున్నట్టు మోడీ ఈ మేరకు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
అలాగే, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో హారిస్ ఉపయోగించిన తమిళ 'చిట్టీస్' పదాన్ని ప్రధాని ఈ సందర్బంగా ఉపయోగిస్తూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఎన్నికల్లో మీరు సాధించిన ఘనత ఒక్క 'చిట్టీస్'కే పరిమితం కాదని, ఇండియన్ అమెరికన్లు అందరికీ గర్వకారణమని పేర్కొన్న ప్రధాని.. ఆమె నాయకత్వం, సహకారంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా జో బైడెన్, కమలా హారిస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments