Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను వేధిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చింది.. అంతే కాల్చేశాడు..

Patna
Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:30 IST)
మహిళలపై వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడికి పాల్పడే వారిపై కఠినమైన శిక్ష విధించేందుకు నిర్భయ, దిశలాంటి చట్టాలొచ్చినా ప్రయోజనం లేదనే చెప్పాలి. తాజాగా తన కుమార్తె (15)ను వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు మహిళ(40)ను యువకుడు కాల్చిచంపిన ఘటన బీహార్‌ రాజధాని పట్నాకు సమీపంలోని జగ్గుబిఘ గ్రామంలో వెలుగుచూసింది. 
 
బాధితురాలిని నీలం దేవిగా గుర్తించారు పోలీసులు. పదిరోజుల కిందట తన కుమార్తెను చందన్‌ యాదవ్‌ (25) అనే యువకుడు వేధించడంతో అతడిని నీలం వారించింది. యాదవ్‌ సహా అతని కుటుంబ సభ్యులతోనూ నీలం వాగ్వాదానికి దిగింది.
 
కుమార్తెను వేధిస్తుండటంపై నీలం భర్త లల్లాన్‌ యాదవ్‌, చందన్‌ యాదవ్‌ల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. బుధవారం ఉదయం సైతం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చందన్‌, అతడి స్నేహితులు నీలం కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
 
చందన్‌ కాల్పుల్లో నీలం ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి భర్త ఫిర్యాదుపై చందన్‌, కుందన్‌ సహా 16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ ఒకరిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపటట్టామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments