Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (06:37 IST)
కరోనా వైరస్‌ కు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌ పై భారత్‌లో రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.

ట్రయల్స్‌లో భాగంగా 'కొవిషీల్డ్‌' వ్యాక్సిన్‌పై పుణెకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయోగాలు నిర్వహించనుంది. కొవిషీల్డ్‌ భద్రత, దాని రోగ నిరోధక శక్తిని నిర్ణయించేందుకు పుణెలోని భారతి విధ్యాపీఠ్‌ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

మనుషుల మీద రెండు, మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆగస్టు 3న ఎస్‌ఐఐకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 17 చోట్ల 18 సంవత్సరాల వయసు పైబడిన 1600 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నట్లు ఎస్‌ఐఐ వర్గాలు వెల్లడించాయి.

ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎస్‌ఐఐ బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments