Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీనామా.. ఆ రాజీనామా వెనుక...?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (06:29 IST)
ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు కొండుభట్ల రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంకు సమర్పించారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు.

రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్ట్. ఆయన పలు పత్రికలకు ప్రధాన సంపాదకులుగా పని చేశారు. రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. వీరిలో పది మందికి కేబినెట్‌ హోదా కూడా ఉంది. 
 
ఆ రాజీనామా వెనుక...?
పేరుకు డజన్ల మంది సలహాదారులున్నప్పటికీ, వారిలో ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లేవారిలో అజయ్‌కల్లం రెడ్డి- సజ్జల రామకృష్ణారెడ్డి-జీవీడీ కృష్ణమోహన్- రామచంద్రమూర్తి వంటి తక్కువమంది వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు.

ఆయన సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. పైగా.. ఆయన పేరుకు ప్రభుత్వ సలహాదారుడైనప్పటికీ, కార్యాలయానికి స్టేషనరీ కూడా ఇచ్చే దిక్కులేదు. అన్నీ కొనుగోలు చేసుకోవడమే. జీఏడీ కూడా.. మంత్రుల కార్యాలయ వ్యవహారాలు తప్ప, సలహాదారులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత కాదని చేతులెత్తేసింది.

ఏపీలో సలహాదారులందరి పరిస్థితి ఇదే. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి చాంబరు కోసం మాత్రమే… అజయ్‌కల్లం స్వయంగా చాంబరు చూసి, అక్కడున్న సెక్రటరీని ఖాళీ చేయించారు. దానితో, ఇక పనిలేకుండా సర్కారు జీతం తీసుకోవడం మంచిదికాదన్న భావనతో.. రెండు నెలల క్రితమే, తన రాజీనామా లేఖను సజ్జలకు ఇచ్చారు.

అయితే, తొందరపడవద్దని, తాను మాట్లాడతానని చెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు రాజీనామా ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments