Webdunia - Bharat's app for daily news and videos

Install App

10న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక చర్చలు.. లాక్డౌన్ తప్పదా?

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (18:12 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు అనేక రకాలైన ఆంక్షలను చేపట్టింది. అలాగే, కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇందులో దేశంలో నెలకొన్న కరోనా స్థితిగతులపై చర్చించనున్నారు.  
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదివారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ఆదివారం 4.30 గంటల నుంచి ప్రారంభమై సుధీర్ఘంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కూడా సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశంకానున్నారు. 
 
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్రం వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం చూస్తుంటే దేశంలో మరోమారు లాక్డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తుందా అనే సందేహం కలుగుతుంది. సోమవారం జరిగే ఆరోగ్య మంత్రుల సమావేశంలో దేశంలో లాక్డౌన్ ఉంటుందా లేదా అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం