10న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక చర్చలు.. లాక్డౌన్ తప్పదా?

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (18:12 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు అనేక రకాలైన ఆంక్షలను చేపట్టింది. అలాగే, కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇందులో దేశంలో నెలకొన్న కరోనా స్థితిగతులపై చర్చించనున్నారు.  
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదివారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ఆదివారం 4.30 గంటల నుంచి ప్రారంభమై సుధీర్ఘంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కూడా సోమవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశంకానున్నారు. 
 
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్రం వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం చూస్తుంటే దేశంలో మరోమారు లాక్డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తుందా అనే సందేహం కలుగుతుంది. సోమవారం జరిగే ఆరోగ్య మంత్రుల సమావేశంలో దేశంలో లాక్డౌన్ ఉంటుందా లేదా అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం