Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో కరోనా ఉధృతి - నలుగురు జడ్జీలకు పాజిటివ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (17:26 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కరోనా కలకలం చెలరేగింది. నలుగురు న్యాయమూర్తులకు ఈ వైరస్ సోకింది. అలాగే, సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కరోనా వైరస్ బారినపడినవారంతా గత మంగళవారం జస్టిస్ సుభాషణ్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరుయ్యారు. 
 
ఆ తర్వాత ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. పిమ్మట చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు.. మరో నలుగురు న్యాయమూర్తులు కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తి రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. 
 
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో నలుగురికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీరితో పాటు.. కరోనా వైరస్ బారినపడిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో వారానికి మూడు రోజుల మాత్రమే వర్చువల్ మోడ్‌లో కేసు విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments