హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు మూసివేత

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (15:54 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలను మూసి వేయాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
 
ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి, వైద్య, పోలీసు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.  అదేసమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మెరుగుపరచాలని, కోవిడ్ క్లస్టర్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
అలాగే, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అస్సాం రాష్ట్రంలో కూడా ఐదో తరగతి వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా కర్ఫ్యూ సమయం కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments