Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు మూసివేత

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (15:54 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలను మూసి వేయాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
 
ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి, వైద్య, పోలీసు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.  అదేసమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మెరుగుపరచాలని, కోవిడ్ క్లస్టర్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
అలాగే, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అస్సాం రాష్ట్రంలో కూడా ఐదో తరగతి వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా కర్ఫ్యూ సమయం కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments