Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం.. భారత్-నేపాల్‌ల మధ్య రచ్చ.. నో డౌట్?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (19:22 IST)
గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. రామ జన్మభూమి వివాదం సద్దుమణిగిందని అనుకునే లోపే గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం మొదలైంది. ఈ వివాదం భారత్-నేపాల్ దేశాల మధ్య జరుగుతోంది. 
 
శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ.. బుద్ధుడూ, మహాత్మా గాంధీలు అనుసరించిన మార్గం, చేసిన బోధనలు అందరికీ ఆచరణీమని అన్నారు. అయితే ఇదే ప్రసంగంలో బుద్ధుడు భారతీయుడని జై శంకర్ అన్నట్టు నేపాల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ జై శంకర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది.
 
బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎవరూ కాదనలేరని పేర్కొంది. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ లో పర్యటించిప్పుడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. 
 
దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్యా బౌద్ధమత వారసత్వం ఉంది. గౌతమ బుద్ధుడు నేపాల్‌లోనే జన్మించాడని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments