Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:05 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మీ కన్నుమూశారు.  కభీ కభీ, ఉమ్రావ్ జాన్ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధులతో కొద్దికాలంగా ఆయన బాధపడుతున్నారు. 
 
ముంబైలోని సుజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి 9,30 గంటల సమయంలో మరణించారు. కొద్దిరోజులుగా ఆయన సుజయ్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. 
 
ఖయ్యాం సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు కూడా ఇచ్చి గౌరవించింది. ఖయ్యం తన 17వ యేట లూథియానాలో తన సంగీత వృత్తిని ప్రారంభించారు. ఉమ్రావ్ జాన్ సినిమాకు సంగీతం అందించిన తర్వాత ఆయన పేరు బాలీవుడ్ లో మారుమ్రోగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments